బ్లడ్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న పేద మైనారిటీ కుటుంబానికి జనసేన ఆర్థిక సాయం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి పట్టణం, రాజీవ్ నగర్ కి చెందిన పేద మైనారిటీ మహిళ పర్వీన్ కుమారుడు రెహ్మాన్ బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నాడన్న విషయం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా జగనన్న కాలనీల సందర్శనకు వెళ్ళినపుడు తెలియజేయగా, స్పందించిన వినుత కోటా ఇంటికి వచ్చి కలవమని చెప్పడంతో సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని వినుత ఇంటికి వచ్చి కలిసి ఆరోగ్య పరిస్థితి తెలియజేశారు. ప్రతి నెల ట్రీట్మెంట్ కోసం చెన్నై హాస్పిటల్ కి వెళ్ళాలని తెలిపారు. హాస్పిటల్ లో చికిత్స ఉచితంగా అందుతున్నా వృత్తి రీత్యా బీడీలు చుట్టే పనిలో కుటుంబం గడవడం కాస్ట తరం అయ్యిందని బాబు ట్రీట్మెంట్ కోసం వెళ్ళిరావడనికి డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. సమస్య తెలుసుకున్న వినుత ప్రతి నెల వెళ్లి రావడానికి కావలసిన ఆర్థిక సాయం 5,000 రూపాయలు ప్రతి నెల అందిస్తామని హామీ ఇచ్చారు. జులై నెలలో వెళ్లి రావడానికి అయ్యే ఖర్చు 5,000 రూపాయలు పర్వీన్ కు అందచేశారు. ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని బరోసా ఇవ్వడం జరిగింది. మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు తోట గణేష్ పాల్గొన్నారు.