అగ్ని ప్రమాదబాధిత కుటుంబానికి ఆర్ధిక సాయమందించిన జనసేన

భీమవరం మండలం ఈలంపూడి పల్లెపాలం గ్రామంలో ఆదివారం కొల్లాటి ఏడుకొండలు ఇల్లు అగ్నికి కాలిపోవడం జరిగింది. మంగళవారం వారి కుటుంబాన్ని నరసాపురం జనసేన పార్టీ ఇంఛార్జ్ బొమ్మిడి నాయకర్, భీమవరం మండలం అధ్యక్షులు మోకా శ్రీను లు పరామర్శించి వారికుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని నిత్యావసర సరుకులు పదివేలరూపాయల ఆర్థికసాయం ఇవ్వడం జరిగింది. సంఘటనా స్థలానికి అనాకోడేరు శ్రీను, పాపోలు ఆంజనేయులు, సంకరపు కోటేశ్వరావు, కొప్పర్తి సత్తిపండు, వాటాల వెంకటేష్, నాగిడి ఏడుకొండలు, నాగిడి పరుశురామ్, అండ్రాజు శివ, ఇలాంపుడి పల్లిపాలెం జనసైనికులు పాల్గున్నారు.