పొన్నాడ మాటలను ఖండించిన జనసేన మత్స్యకార నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చూసి మాట్లాడుతున్నారు అనడం చాలా హాస్యాస్పదంగా ఉందని, పవన్ కళ్యాణ్ తన సినిమా రిలీజ్ కోసం ఇటువంటి ఈవెంట్లు పెడతారు ఆనడం చాలా దుర్మార్గం, ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని తన సినిమా ఫ్రీ రిలీజ్ ను వాయిదా వేసుకున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ జీఓ 217 మత్స్యకారులకి ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు కావున మా నాయకులు పవన్ కళ్యాణ్ నర్సాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో వేలాది మంది మత్స్యకారుల సాక్షిగా జీఓ కాపీ చించి వేయడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఏ విధంగానూ ఉపయోగపడలేదు అన్నారు పొన్నాడ సతీష్ తన మంత్రి పదవి కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు తప్ప మత్సకారుల మీద ప్రేమతో కాదు. కావున సతీష్ కుమార్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సంగాని రామకృష్ణ, పోతా బత్తుల రాంబాబు, వైదాడి దశరథ, పెమ్మాడి గంగాద్రి, మండల అధ్యక్షులు గొల్లకోటి వెంకన్న బాబు, మోకా బాల ప్రసాద్, మద్దింశెట్టి పురుషోత్తం, దూడల స్వామి సాన బోయిన వీరభద్రరావు, బొంతు కనకారావు, కడలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.