మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన మనుక్రాంత్

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పరిశ్రమల శాఖామాత్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నెల్లూరు లోని వారి స్వగృహంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ నివాళులు అర్పించారు.

మేకపాటి రాజమోహన్ రెడ్డి ని వారి కుటుంబ సభ్యులను కలసి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం లో వారితో జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు కిషోర్ గునుకుల, సుజయ్ బాబు మున్వర్, పవన్, శ్రీనివాసులు రెడ్డి, సుధీర్, రాజు, కన్నా, భీమా, హేమంత్, ప్రసన్న, తదితర జనసేన నాయకులు పాల్గొని సంతాపం తెలిపారు.