100 గృహాలపై జనసేన జెండా రెపరెపలు

పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, కైగల్ గ్రామంలో జిల్లా అద్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ సూచన మేరకు పసుపులేటి దిలీప్, కైగాల్ కుమార్ అధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేసి, 100 గృహాల పైన జెండాలను ఎగరవేయడం జరిగింది. అనంతరం వైసీపీ, టీడీపీ నుండి పెద్దలు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డిపల్లి మండల అధ్యక్షులు చైతన్య, దినేష్, రాజు, కృష్ణ, బాబు, కైగల గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.