కొత్తవలసలో జనసేన జెండా ఆవిష్కరణ

ఆమదాలవలసల నియోజకవర్గం, ఆమదాలవలసల మండలం గరమెళ్ళ కొత్తవలస గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ ప్రజల సమక్షంలో జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం అక్కడ జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో పాల్గొని కార్యకర్తలని మరియు వీరమహిళలని ఉద్దేశించి నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ ప్రసంగించారు. ముఖ్యంగా చెఱకు సమస్యలు గురుంచి తెలుసుకొని వాటి సమస్యలు గురుంచి మాట్లాడి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గ్రామంలోని 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థి పైడి మురళీ మోహన్, బాల మురళి, గణేష్, రాజశేఖర (మైఖెల్), శ్రీను, ప్రసాద్, కోటి, మిన్నరావు, రాంబాబు, అప్పలరాజు, సింహాచలం, జనసైనికులు తదితరులు పాల్గొని కార్యక్రమని జయప్రదం చేశారు.