పెళ్లకూరు మండలంలో జనసేన జెండా ఆవిష్కరణ

సూళ్లురుపేట నియోజకవర్గ పరిధిలోని పెళ్లకూరు మండలంలోని చెంబేడు గ్రామంలో పెళ్లకూరు మండల అధ్యక్షుడు విజయ్ మల్లాం ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించారు. దీనికి ముఖ్య అధితులుగా సూళ్లురుపేట నియోజకవర్గ ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్, నెల్లూరు నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, శిరీష, నలిశెట్టి శ్రీధర్ విరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు. విజయ్ మల్లాం మాట్లాడుతూ జనసేన అధినేత ఆశయాలను గడప గడపకు చేరవేయాలన్న సంకల్పంతో పార్టీని పల్లె పల్లెల్లో బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియచేసారు.