రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి గుమ్మానికి జనసేన

మదనపల్లి పట్టణం, నడి బొడ్డున ఉన్న మేదర వీధిలో శుక్రవారం జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి ఆధ్వర్యంలో ప్రతి గుమ్మానికి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రామదాస్ చౌదరి మాట్లాడుతూ ఆసియాలోనే పెద్ద రెవిన్యూ డివిజన్ గా ఉన్న మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించకుండా మదనపల్లి, తంబళ్ళపల్లి, పుంగనూర్, పీలేరు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే రాబోయే కాలంలో తగిన మూల్యం చెలీంచుకోవాల్సి వస్తుందని, అలాగే దాదాపు 90 శాతం పనులు పూర్తి అయిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు పూర్తి అయిన మిగిలిన పనిని పూర్తి చేయకుండా గాలికి వదిలేసిందని హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే రైల్వే లైన్ ను క్యాన్సిల్ చేసిందని ఈ వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజల ఆత్మఅభిమానం,మౌలిక వసతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువతలును దెబ్బకోట్టారు గత 23 రోజులుగా అంగన్వాడీల డిమాండ్ లను తీర్చకుండా, రెండు మూడు రోజులుగా పారిశుధ్య కార్మికుల రోడ్డుకి ఎక్కారు మీద దెబ్బకోట్టారని అన్నారు. అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని రాబోయే కాలంలో ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ని గెలిచి పవన్ కళ్యాణ్ కి కానుకగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి, లవన్న, రాజారెడ్డి, సెక్రటరీ నాగవేణి, గంగులప్ప, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, సెక్రటరీ అర్జున, ప్రధాన కార్యదర్శి నవాజ్, సెక్రటరీ జనర్దన్, దినకర్, సత్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.