విడివాడ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన

తణుకు నియోజకవర్గం: ఇరగవరం మండలం, కాకిలేరు గ్రామంలో నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు గారి ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ఆశయాలను రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. విడివాడ రామచంద్రరావు వెంకట్రాయపురం 16వ వార్డులో జూన్ 2వ తారీఖున రైలు ప్రమాదంలో మరణించిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించి ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతంలో ఇది మండపాక పంచాయతీలో ఉండేది దీని అభివృద్ధి పేరు చెప్పి టౌన్ షిప్ లోకి విలీనం చేసి స్థానికులపై పన్నుల భారం మోపారు అని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక కాలుష్యం కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నారని దీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని తణుకు నియోజవర్గ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణం అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు పట్టణం యూత్ అధ్యక్షులు గర్రె తులసీరామ్, 16వ వార్డు జనసేన పార్టీ నాయకులు ఆలపాటి నాగేశ్వరావు, పేకేటి రమేష్, మారిశెట్టి ఎల్లారం, కండవల్లి లోకేష్, వల్లూరు సన్నీ, దూలపల్లి చక్రవర్తి, భీమవరపు శ్రీనివాసరావు, వల్లూరి నగేష్, జనసేన పార్టీ తణుకు మండలం అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ మండపాక ఎంపీటీసీ వేల్పూరి శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.