సౌదీలో అంబరాన్నంటిన జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పుట్టిన ఊరికి దేశానికి దూరంగా ఉంటున్నా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల, జనసేన పార్టీ పట్ల వారికి ఉన్న నమ్మకం ప్రతి రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. మార్చి 14వ తేదీన జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ముందుగా సౌదీ అరేబియా లోని జుబైల్ లో 10వ తేదీన జనసైనికుల నాయకుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. జుభైల్ లోని పార్టీ నాయకులు జి. భాస్కరరావు, ఖె నగేష్, చింతల మూర్తి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియాలోని పలు ప్రాంతాల నుండి జనసైనికులు మరియు నాయకులు పాల్గొని పార్టీకి తమ సంఘీభావం తెలిపి రాబోయే కాలంలో పార్టీని సంఘటితంగా ముందుకు తీసుకెళ్లాలి అని తమ బంధువులు మిత్రులతో మాట్లాడి పార్టీ విధానాలను వారందరికీ అర్థం అయ్యేలా పదేపదే చెప్పి వారిలో మార్పు తీసుకురావాలని కోరారు. రాబోయే కాలంలో పార్టీకి అన్ని విధాల వెన్నుదన్నుగా నిలబడాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలొ రాజ మైలవరపు, వాజిద్, గణేష్ లొకం, పవన్, తేజ, తారక్, గిరి బాబు, రవి తేజ, నాని, రామ క్రిష్ణ, గోవింద్, అభిషేక్, సాయి, సయ్యద్ ఖాలీష, తాజుద్దీన్, వినయ్, భాను తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ ప్రసన్న, గౌరీ శంకర్, అవినాష్, వెంకట్రావు, సతీష్ లను జనసేన పార్టీ కండువా కప్పి నాయకులు మరియు జన సైనికులు వారందరినీ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల, నాయకుల లో స్ఫూర్తిని నింపింది. పవన్ కళ్యాణ్ ని సీ.ఎం కళ్యాణ్ గా చూడటమే తమ అభిమతంగా కార్యక్రమం జరిగింది.