జనసేన ఉచిత అంబులెన్స్ సర్వీస్

రాజానగరం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజానగరం నియోజకవర్గంలో 24 గంటలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా మూడు మండలాల్లో మూడు ఉచిత అంబులెన్స్ సర్వీసులను ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఉచిత అంబులెన్స్ సర్వీసును అక్టోబర్ నెలలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పూర్తితో ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగిందని… ప్రజలకు అత్యవసర సమయాల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా పూర్తిస్థాయిలో ఉచితంగా అందుబాటులో ఉంటుందని అన్నారు. దీనికోసం 24 గంటలు అందుబాటులో ఉండేవిధంగా ఒక హెల్ప్ సెంటర్ ను కూడా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంబులెన్స్ సర్వీసును వినియోగించుకునేవారికి ఆసుపత్రి దగ్గర తమవంతు సహకారం అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు.