ఈతకోట సురేష్ కి మనోధైర్యాన్నిచ్చిన జనసేన

  • 15000/- ఆర్ధికసాయమందించిన జనసైనికులు

అమలాపురం నియోజకవర్గం, ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు జనసేన పార్టీకి 2014 నుంచి పార్టీకి అండగా ఉంటూ పని చేస్తున్న ఈతకోట సురేష్ ఇటీవల అనారోగ్యం పాలవడంతో స్థానిక జనసైనికులు సమకూర్చిన 15వేల రూపాయిలని నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు మరియు జనసైనికుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం బీముడు, ఉప్పలగుప్తం ఎంపీటీసీ తాళ్ళ లలిత రవి, సన్నవిల్లి పంచాయతీ కార్యవర్గ సభ్యులు గనిశెట్టి వీరాస్వామి, చిక్కం చిరంజీవి శ్రీనివాస్(బుల్లి శ్రీను), నిమ్మకాయల మను, గనిశెట్టి వీరు, గనిశెట్టి లలిత, ఆకుల సూర్య నారాయణమూర్తి, చిక్కం సూర్య మోహన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.