శ్రీకాంత్ చారికి నివాళులర్పించిన సుంకెట మహేష్ బాబు

భైంసా: తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. మహనీయుడి వర్ధంతి సభను జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంతాచారి స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. వారి త్యాగాలను యువతకు ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలి. శ్రీకాంతాచారి జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. శ్రీకాంతాచారి జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆత్మార్పణం చేసుకున్న శ్రీకాంతాచారి అమరత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరద్దన్నారు. ఇలాంటి వీరుడిని కన్న వారి తల్లి తండ్రుల కు మా పాదాభివందనాలు తెలియచేస్తున్నాం అన్నరు. ఈ కార్యక్రమంలో రామోజివార్, గంగాప్రసాద్, అకోజి, పవన్, ముత్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.