దేవీ నవరాత్రి ఉత్సవాలలో అనుశ్రీ

రాజమండ్రి, స్థానిక 2వ వార్డు నారాయణపురంలో దేవి నవరాత్రులు మహోత్సవాలు సందర్భంగా రాజమండ్రి నగర జనసేన నాయకులు మానే ఆదిబాబు ఫ్రెండ్స్ సర్కిల్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ హాజరవడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు అయిన శ్రీకృష్ణ భగవాన్ కోళ్ల వీరభద్ర రావు మర్యాదలతో సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఆలయ పురోహితులు ప్రత్యేక ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం దుర్గమ్మ మండపాన్ని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నల్లంశెట్టి వీరబాబు రాజమండ్రి కార్పొరేషన్ కార్యదర్శి గుణ్ణం శ్యాంసుందర్ పాల్గొన్నారు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.