జనసేన – గిరిసేన.. జనం వద్దకు జనసేన 42వ రోజు

జనసేన – గిరిసేన జనం వద్దకు జనసేన 42వ రోజు కార్యక్రమంలో భాగంగా పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం నందివాడ గ్రామంలో పాలకొండ జనసేన నాయకులు పర్యటన చెయ్యడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన జానీ మాట్లాడుతూ వైస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి సంత్సరం జాబ్ కేలండర్స్ పేరుతో జాబ్స్ తీస్తామని చెప్పి నేటికీ ఒక్క జాబ్ కూడా తియ్యకపోవడం వల్లన యువతి యువకులు డిగ్రీ, పీజీ, బి.ఈ.డి, డైట్, స్టాఫ్ నర్సింగ్ పోలీస్ శాఖ ఇలా ఏ పోస్ట్ కూడా తియ్యాలపోవడం వలన నిరద్యోగులుగా ఉండిపోతున్నారు. ఈ విషయంపై ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారు జనవరి 12న రణస్థలంలో చేపట్టే యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని జనసేన జానీ చెప్పడం జరిగింది. బి.పి.నాయుడు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు యువతని రాజకీయాల్లోకి అడుగులు వేయించాలనే తపనతో జనసేన పార్టీ యువతకి భరోసాన్ని కల్పించడానికి యువశక్తి అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గం యువత హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాము. మత్స.పుండరీకం మాట్లాడుతూ నూతన సంవత్సరలో శ్రీకాకుళం జిల్లాలో యువశక్తి భారీ బహిరంగ సభ కి శ్రీకారం చుట్టడం శుభపరినామం, జనసేనాని పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభకు అన్నివర్గాల ప్రజలు వచ్చేసి జనసేన – యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. లో నందివాడ జనసేన నాయకులు, సతీష్, చంద్రశేఖర్, వినోద్, తన్విస్, ప్రసాద్, నవీన్, ప్రవీణ్, మరియు పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జామి. అనిల్, కడ్రక సాయి, కర్ణేన సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.