జనసేన పార్టీలో చేరిన మహిళలు

గుంటూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు 17వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు వై.ఏడుకొండలు ఆధ్వర్యంలో వీర మహిళలు యాదాల మహాలక్ష్మి, తిరుపతమ్మ, శివకుమారి, మానస, ముబీనా, జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గుర్వారం వారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరందరినీ గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరేళ్ల సురేష్ జనసేన పార్టీ కండవాను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో
గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షులు చింత రేణుక రాజు, కొండూరు కిషోర్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి కటకంశెట్టి విజయలక్ష్మి, 17 డివిజన్ అధ్యక్షుడు వై.ఏడుకొండలు, మిద్దె నాగరాజు, రెల్లి సంఘ నాయకులు సోమి ఉదయ్ కుమార్, మరియు నగర కమిటీ సభ్యులు, మరియు 17 వ డివిజన్ కమిటీ సభ్యులు, మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.