రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం చేపట్టిన జనసేన

నంద్యాల జిల్లా, బనగానపల్లె నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రోడ్లు అన్ని కూడా జులై 15 వ తారీకు లోపు ఎక్కడ కూడా గుంతలు లేకుండా రోడ్లు బాగుచేయస్తా అని ఛాలెంజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే ఐతే ఆ ఛాలెంజ్ ని వారు నిలబెట్టుకోలేకపోయారు. దానికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు, కార్యకర్తలు, అందరూ కూడా డిజిటల్ క్యాంపన్ నిర్వహించాలి అని #GoodMorningCMSir అనే హేష్ టాగ్ ను ఉపయోగించి 3 సంవత్సరాలుగా గాడ నిద్రలో ఉన్న సీఎంని నిద్రలేపి ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని తెలిపేలా అలాగే మన బనగానపల్లె నియోజకవర్గం మరియు గ్రామాలలో పాడయిపోయి వున్న రోడ్లను ఆయనకు చూపించే విధంగా ఈ రోజు ఉదయం తమ్మడపల్లె గ్రామ రహదారి ఎంపిడిఓ ఆఫీసు వద్ద దెబ్బ తిన్న రోడ్లను మరియు ఆంధ్రప్రదేశ్ లో పాడయిపోయిన రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని బనగానపల్లె నియోజకవర్గ జనసేన నాయకులు భాస్కర్ ఆధ్వర్యంలో మార్నింగ్ సీఎం సార్ అని నిరసన డిజిటల్ క్యాంపెయిన్ ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విక్రమ్, కాసిం, జనార్ధన్, కిరణ్ రెడ్డి, భాష, తదితరులు పాల్గొన్నారు.