అద్వానంగా ఉన్న రహదారులపై అరకు జనసేన డిజిటల్ క్యాంపెన్

అరకు నియోజకవర్గం: మూడవ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ పిలుపుమేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం కేంద్రం పరిధిలో గల మాడగడ పంచాయితీలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మండల అధ్యక్ష కార్యదర్శులు సాయిబాబా దురియా అల్లంగి రామకృష్ణ, గతన్ లక్ష్మణ్ రావు, కిలో రాజా భరత్ మరియు గ్రామస్తుల సహకారంతో మూడో రోజు కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సమీపంలో ఉన్న కల్వర్టు లేని రోడ్ల గుంతలను పరిశీలించడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా దురియా మాట్లాడుతూ తక్షణమే ఈ గ్రామంలో కల్వర్ట్ నిర్మించాలని.. వందలాది మంది వాహనచోదకులు రాకపోకలు జరుగుతుందని ఒకపక్క రోడ్లలో నీరు మరోపక్క రోడ్ల గుంతలు వల్ల రాకపోకలు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని సమస్య పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సమస్యను సంబంధిత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.