ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్లను సురక్షితంగా పక్కకు మార్చాలని వినతిపత్రమిచ్చిన జనసేన

గుంతకల్ పట్టణం వాల్మీకి నగర్ లో అత్యంత ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు మరియు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్లు ఇంటి పైన వెళుతున్నాయి వాటిని సురక్షితంగా పక్కకు మార్చాలని ఏడిఈ కి వినతి పత్రమిచ్చిన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ ఏడిఈ తో మాట్లాడుతూ… గుంతకల్ పట్టణం ఎస్ఎన్ పేట్, వాల్మీకి నగర్ జనావాసం ఎక్కువగా ఉండే ప్రాంతము నందు కరెంటు స్తంభాలు ఒకవైపుకు ఒరిగి మరియు ఎలక్ట్రికల్ సర్వీస్ వైర్ లు ఇంటి పైనుండే వెళుతూ అత్యంత ప్రమాదకరంగా మారి ప్రాణనష్టం కలిగించే విధంగా ఉన్నాయి. మహిళలు, చిన్నపిల్లలు ప్రమాదకరంగా మారిన కరెంటు స్తంభాలు, వైర్ల వల్ల వారి ఇంటిపై కూడా వెళ్లడానికి వీలులేకుండా పోయింది. గతంలో ఆ సర్వీస్ వైర్లను మార్చడానికి మీ ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది కొన్ని కొత్త కరెంటు స్తంభాలను ను కూడా ఏర్పాటు చేశారు, కానీ ఆ ఎలక్ట్రికల్ వైర్లను సురక్షితంగా కొత్త స్తంభాలపై మార్చడానికి చాలా నెలలుగా అలసత్వం జరుగుతుంది కావున ఆ కాలనీవాసులు పై దయవుంచి వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గుంతకల్ మండలం జనసేన పార్టీ పార్టీ అధ్యక్షుడు కురువ పురుషోత్తం, 13 వ వార్డు ఇన్చార్జి బండి శేఖర్, ఎస్. కృష్ణ, పాండు కుమార్, రమేష్ రాజ్, ఆటో రామకృష్ణ, సంసన్ రాజ్, ప్రకాష్ నిస్వార్థ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.