“అంతర్జాతీయ క్రికెట్ పోటీలకి” ఎంపిక అయిన నర్సంపేట విద్యార్ధిని సన్మానించి, ఆర్ధిక ప్రోత్సాహం అందించిన జనసేన

నర్సంపేట పట్టణంలోని ఆచార్య డిగ్రీ కళాశాలలో యం.పి.సిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి బాధావత్.నవీన్ (మహాబూబబాద్ జిల్లా, గూడూరు మండల నివాసి)ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ పోటీలకి ఎంపిక అయిన విషయం తెలుసు కొని జన సేన విద్యార్ధి విభాగం జిల్లా నాయకులు “ఎలబోయిన డేవిడ్ అధ్వర్యంలో “అభినందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన సేన పార్టీ వరంగల్ జిల్లా మరియు నర్సంపేట నియోజకవర్గ నాయకులు మేరుగు శివ కోటీ యాదవ్ హాజరు అయ్యి నవీన్ ని అభినందించి, శాలువ, మొమెంటోతో సత్కరించి ప్రోత్సాహకంగా 5,000 రూపాయల నగదును జనసేన పార్టీ తరఫున కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జీజుల సాగర్ చేతుల మీదుగా అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మేరుగు.శివ కోటీ యాదవ్ మాట్లాడుతూ.. జన సేన పార్టీ అధినేత “శ్రీ పవన్ కళ్యాణ్” స్ఫూర్తితో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కలిగినటువంటి నవ యువతరాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు. అలాగే నవీన్ క్రికెట్లో ఉన్నత శిఖరాలకి చేరుకోవాలి అని కోరుతూ, ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహిస్తున్న “ఆచార్య డిగ్రీ కళాశాల వారికి” జన సేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం టాకుర్.రవీందర్ సింగ్,రాచకట్ల రవి, అధ్యాపకులు, విద్యార్థులు మరియు జనసేన కార్య వర్గ సభ్యులు వంగ మధు, ఒర్సు రాజేందర్, గంగుల రంజిత్, అజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.