తదేకం ఫౌండేషన్ సహకారంతో అగ్నిప్రమాద బాధితునికి జనసేన అండ

కాకినాడ రూరల్: కరప మండలం, వేళంగి గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదంలో ఉపాధి (టైలరింగ్ షాప్)కోల్పోయిన కొప్పిశెట్టి లోవరాజును ఆదుకోవాలి అనే ఉద్దేశంతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సూచనల మేరకు తదేకం ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ను ఆదివారం కాకినాడ గొడరిగుంటలో పంతం నానాజీ చేతులమీదుగా కొప్పిశెట్టి లోవరాజుకు అందించడం జరిగింది. అదేవిదంగా కరప మండలం సేవాదళ్ సభ్యులు ఆయనకి షెడ్ నిమిత్తం 9200 రూపాయలు, మరియు కరప మండలం సీనియర్ జనసేన నాయకులు బోగిరెడ్డి కొండబాబు 5800 రూపాయలు సహాయం అందించారు. వీరందరికి పంతం నానాజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేళంగి గ్రామ అధ్యక్షులు ప్రసాద్, తూరంగి గ్రామ జనసేన నాయకులు శాండీ, జిల్లా కార్యదర్శి ముసలయ్య, దాసరి శివ, పోసిన రాము, హరిబాబు, మహేష్, రాయుడు, తదితరులు పాల్గొన్నారు.