వేలంపాటలో లడ్డును కైవసం చేసుకున్న జనసేన జాని

పాలకొండ, మన్యం జిల్లా బొడ్లపాడు గ్రామంలో నందిన్న యూత్ ఆధ్వర్యంలో బొడ్లపాడు ప్రజలు అందరూ సహాయ సహకారంతో అఖండ అన్నదానం మరియు వినాయక స్వామి నిమజ్జనం చాలా ఘనంగా జరిగింది. అలాగే వినాయక స్వామి యొక్క లడ్డును వేలంపాటలో 5116/- రూపాయిలకి జనసేన జాని పాడటం జరిగింది. వినాయక స్వామి యొక్క ఆశీస్సులు దైవం ఆశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ మా గ్రామ ప్రజలు పైన ఉండాలి అని ప్రతి ఒక్క రైతు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకుంటున్నామని తెలిపారు.