నియోజవర్గ ప్రజా సమస్యలపై జనసేన నాయకుడు చెల్లుబోయిన సతీష్ కుమార్ పోరాటం

పిఠాపురం, ప్రజా సమస్యలపై జనసేన తరఫున చెల్లుబోయిన సతీష్ కుమార్ నాయకత్వంలో టౌన్ జనసేన నాయకులు సిద్దమయ్యారు. అయితే బుధవారం పిఠాపురం టౌన్ లో ఉన్న ఒకటవ వార్డు నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అన్ని వార్డులు మరియు నియోజకవర్గం అంతా తిరిగి కార్యక్రమం సిద్ధం చేశాం. ఒకటవ వార్డు భవన నిర్మాణం కార్మికుల భవనం వెనక ఉన్న దారిలో అడుగు రోడ్డు ఉందని, అదొక వింత రోడ్డు అని ముసలి వాళ్లు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలాసార్లు స్కూల్ పిల్లలు జారి పడిపోయి పుస్తకాలు తడిసిపోవడం చాలాసార్లు జరిగాయని, మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు చుట్టపు చూపుగా వస్తున్నారని ఈ సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాటం ఆగదని చెల్లుబోయిన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లం కిషోర్, పట్టా చిన్న జనసేన నాయకులు పల్నాటి మధు, వేల్పుల చక్రధర్, కొండేపూడి రెడ్డి మనోహర్ పసుపులేటి శివ, దేశి రెడ్డి గంగాధర్, ప్రసాద్ మరియు మాదాసు వీరభద్రరావు పాల్గొన్నారు.