నూజివీడు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్

నూజివీడు నియోజకవర్గం: తెలుగుదేశం – జనసేన పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు మరియు నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఉమ్మడిగా కలిసి నూజివీడు టు ఏలూరు వయా వేల్పుచర్ల రోడ్ పై ముసునూరు అడ్డరోడ్డు నుంచి నాగేంద్రపురం వరకు నడుచుకుంటూ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, తోట వెంకట్రావు, ఏనుగుల చక్రి, బొబ్బిలి శ్రీకాంత్, గొల్లపల్లి శ్రీకాంత్, ముసునూరు మండల నాయకులు గిరి గోపి, తిరుమలశెట్టి అనిల్, వీరస్వామి, ఉదయ్ కుమార్, కడియం శ్రీను, మట్ట స్వామి, గుంట్రు రాజశేఖర్, చేబత్తిన విజయ్, నాగరాజు, ఏసు బాబు, శివ నాగేంద్ర, రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు నూతక్కి వేణు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగు రైతు అధ్యక్షులు జగ్గవరపు వెంకటరెడ్డి, ముసునూరు మండల ప్రధాన కార్యదర్శి కందుల పిచ్చయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి గద్దె రఘు బాబు, నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరు రాజా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గుడపాటి అజయ్ కుమార్, కొల్లి గంగారాం, మాజీ ఎంపీపీ మసిముక్కు సుబ్బారావు, సర్పంచ్ గద్దల మోహన్ సుహాసిని మరియు తెలుగుదేశం – జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.