మరుగుదొడ్ల సమస్యని పరిష్కరించాలని జనసేన నాయకుల భిక్షాటన

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు సమస్యని పరిష్కరించాలని శుక్రవారం కలెక్టరేట్ ముందు జనసేన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ మిరియాల రామకృష్ణ మరియు జనసేన నాయకులు బిక్షాటన చేసారు. ఈ సమస్యపై సానుకూలంగా స్పందిచక పోగా, మేము ఇష్టం వచ్చినప్పుడే చేస్తాం అని జాయింట్ కలెక్టర్ మధుసూదన్ గౌరవ పదవిలో ఉండి బాధ్యతారహిత్యాంగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో జనసేన నాయకులు కలెక్టరేట్ ముందే బైఠాయించి భిక్షాటన చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని అధికారులు తీరుకి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు అజయ్ క్రిష్ణ యాసంనేని, మెడబోయిన కార్తీక్, బండారు రామకృష్ణ, శ్రీకాంత్, సాయి గోపి, రమణ కుమార్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.