పేద రోగికి జనసేన నాయకులు రౌతు వితరణ

విజయనగరం: స్థానిక 35వ డివిజన్, వంటి తాడి అగ్రహారంలో గత కొంత కాలంగా రెండు కిడ్నీలు పాడై పోయి, అనారోగ్యంతో బాధ పడుతున్న అంబటి పార్వతి కి జనసేన నాయకులు రౌతు సతీష్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి, నెలసరి సరిపడా కిరాణా సరుకులు ఇచ్చి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు రౌతు సతీష్ మాట్లాడుతూ అంబటి పార్వతి వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకొని చిన్నసహయం చేశామని, భవిష్యత్తులో వారి కుటుంబానికి జనసేన తరుపున అండగా ఉంటామని అంటూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళతమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.