Vizag: జనసేన నాయకుల అరెస్ట్

విశాఖ జిల్లాలోని రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఢీకొని తాపీ మేస్త్రి సూర్యనారాయణ మృతి చెందారు. మృతుడు కుటుంబాన్ని ఆదుకోవాలని శాంతియుతంగా మంత్రి గారి నివాసం ముందు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్న జనసేన భీమిలి ఇంచార్జీ శ్రీ సందీప్ పంచకర్ల, విశాఖ నార్త్ ఇంచార్జ్ ఉషాకిరణ్ పసుపులేటి, పార్టీ వీరమహిళలు అమరరపు దుర్గ, కంటపల్లి త్రివేణి, కళ యడ్లపల్లి, లక్ష్మీ, నాగమణి, నాయకులు గుడివాడ అప్పారావు, శేఖర్, శ్రీను మొదలగు వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ంవ్ఫ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు ఫాఛ్ సభ్యులు శ్రీ కోన తాతారావు, చోడవరం ఇంచార్జ్ మరియు జనసైనికులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.