పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ చంద్రశేఖర్ ను సత్కరించిన జనసేన నేతలు

కాకినాడ రూరల్ వాస్తవ్యులు శంకురాత్రి ఫౌండేషన్ అధినేత, కిరణ్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రశేఖర్ చేస్తున్న సేవలకు మెచ్చి ఎంతో ప్రతిష్టత్మకమైన అత్యున్నత మైన పద్మశ్రీ బిరుదును డాక్టర్ చంద్రశేఖర్ కు భారత ప్రభుత్వం ఇవ్వడం ఈ ప్రాంత వాసిగా ఎంతో గర్వపడుతున్నామని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆయన్ని స్వయంగా కలిసి పవన్ కళ్యాణ్ తరపున వారికీ శుభాకాంక్షలు తెలిపిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్, సిటీ ఇంచార్జ్ లు పంతం నానాజీ, ముత్తా శశిధర్.. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి డాక్టర్ చంద్రశేఖర్ కు గజమాల వేసి దుస్సాలువాలతో సన్మానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ కి సంబందించిన జనసేన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.