వారాహి యాత్ర సన్నాహక కార్యక్రమాలను పరిశీలించిన జనసేన నాయకులు

అవనిగడ్డ: అక్టోబర్ 1వ తారీకున అవనిగడ్డలో జరిగే వారాహి యాత్ర కోసం జరిగే సన్నాహక కార్యక్రమాలను శనివారం కృష్ణాజిల్లా జనసేన నాయకులు పరిశీలించారు. తదుపరి అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాల నాయకులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తదుపరి సభప్రాగణంను పరిశీలించి సభా అనుమతి కొరకు పోలీసు ఉన్నతాధికారులును సంప్రదించారు. ఈ కార్యక్రమంలో బండ్రెడ్డి రామకృష్ణ, పోతిన మహేష్, అక్కల రామ్మోహనరావు(గాంధీ), జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.