బలుసుపాటి గౌతమ్ కు నివాళులర్పించిన జనసేన నాయకులు

మంగళగిరి, జనసైనికుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని బలుసుపాటి గౌతమ్ నందా ప్రథమ వర్ధంతి కార్యక్రమం యర్రబాలెం గ్రామంలోని నాగలక్ష్మి విద్యాలయం సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ మంగళగిరి మండల సంయుక్త కార్యదర్శి మాణిక్యాల సాయి గోపి హాజరై గౌతమ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జనసైనికులు దోనే నాగ సుధీర్, చేబ్రోలు పరుశురాం, కాపరౌతు సుందరయ్య, చనుమోలు కిరణ్, ఆకుల అనిల్, గోపిశెట్టి ధనుంజయ్, వీర మహిళలు దూళ్లపూడి పావని, బత్తినేని రాజేశ్వరి మరియు స్కూల్ స్టాఫ్ పాల్గొని నివాళులర్పించారు.