ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇచ్చిన జనసేన నాయకులు

మంగళగిరి, యర్రబాలెంలో ఇటీవల ప్రారంభమైన వైయస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వాసితులు శుక్రవారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కలిసి తమ ఇళ్ళను పడగొట్టి రెండు సంవత్సరాలు అవుతుందని, ఆ స్థలంలో నివాసం ఉంటున్న తమ నాలుగు కుటుంబాలను ఖాళీ చేయించి ఆసుపత్రి నిర్మాణం చేశారని ఆసుపత్రి నిర్మాణం పూర్తయి, ప్రారంభం కూడా అయిందని కానీ తమకు ఇప్పటికీ ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, ఇప్పటికైనా ఎమ్మెల్యే, అధికారులు స్పందించి తమ నాలుగు కుటుంబాలకు ఇళ్ల స్థలం కేటాయించాలని కోరారు. స్థానిక వైసీపీ నేతలు మాత్రం మీది మా పార్టీ కాదు అని చులకనగా మాట్లాడుతున్నారని వాపోయారు. దీనితోపాటు గ్రామంలోని మిగతా సమస్యలపై జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.