జనసేన మండలాధ్యక్షునికి మనోధైర్యాన్నిచ్చిన శివదత్ బోడపాటి

పాయకరావుపేట, జనసేన పార్టీ తుని మండల అధ్యక్షులు దారకొండ రమణ వైజాగ్ కేర్ హాస్పిటల్ లో అనారోగ్యంతో ఐసియులో ఉండడం జరిగింది. వారిని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ శివదత్ బోడపాటి పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ సందర్భంగా శివదత్ బోడపాటి మాట్లాడుతూ దారకొండ రమణ అనారోగ్యంతో ఉండి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చెయ్యాలి అని చెబుతుంటే ఆయనకు కన్నీళ్లు ఆగలేదని, గుండెల నిండా జనసేన పార్టీపై ప్రేమ, నాకేమీ కాదు అనే ధైర్యం కనిపించిందని తెలిపారు. ఇలాంటి గుండె బ్రతకాలి జనసేన పార్టీ గెలుపు చూడాలని అన్నారు. భగవంతుడి ఆశీస్సులతో తొందరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.