జనసేన ఆధ్వర్యంలో స్ఫూర్తిప్రదాత చిరంజీవి జన్మదిన వేడుకలు

రాజాం జనసేన పార్టీ కార్యాలయంలో డా.పద్మభూషణ్ మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదిన వేడుకలు రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ చిరంజీవి నేటి తరానికి స్ఫూర్తి ప్రధాత అని, ఎన్నో సేవకార్యక్రమాలు చేపట్టారని, ఎవరికి ఏ కష్టం వచ్చిన వారికి అండగా నిలబడుతున్నారని, చిరంజీవిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సేవభావంతో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ కుమారి, నాయకులు నమ్మి దుర్గారావు, హరిబాబు, సింహాచలం, రామకృష్ణ, నాగరాజు, సైడాల దాలి నాయుడు మరియు మెగా అభిమానులు పాల్గొన్నారు.