యువశక్తి విజయవంతం కావాలి.. సూర్యభగవానుడికి జనసేన నాయకుల ప్రత్యేక పూజలు

అరసవిల్లి: జనవరి 12న రణస్థలంలో జరగబోయే యువశక్తి కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలని, కార్యక్రమం విజయవంతం కావాలని శ్రీకాకుళం జిల్లా, అరసవల్లి నందు ప్రసిద్ది గాంచిన సూర్యభగవానుడి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర కార్య నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానంతరం స్వామి వారి దర్శనానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు తాతం శెట్టి నాగేంద్ర, కొట్టే వెంకటేష్ లను అర్చకులు సన్మానించి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.