Srikalahasti: వరద ముంపు ప్రాంతాల్లో జనసేన నేతల పర్యటన

రాళ్ల కాలువ సమస్యపై పోరాటానికి హామీ

శ్రీకాళహస్తి, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన ప్రాంతాల్లో జనసేన నాయకులు పర్యటించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండల పరిధిలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో నష్టంపై అధ్యయనం చేసే ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ అంజూరు చక్రధర్. ముచ్చివోలు గ్రామం వైపు ఉన్న 20 పంచాయితీల ప్రజలు రాళ్ల కాలువ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కాలువ వద్ద కనీసం హెచ్చరికల బోర్డులు లేవు. ఇక్కడ వంతెన నిర్మించాలన్న డిమాండ్ ను నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాలు కురిసిన సమయంలో ఈ 20 గ్రామాల నుంచి శ్రీకాళహస్తికి రాకపోకలు నిలిచిపోతాయి. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా రాళ్ల కాలువ సమస్య పరిష్కారానికి పోరాటం చేస్తామని మాటిచ్చిన శ్రీ అంజూరు చక్రధర్, అధికారులు, పాలకులు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.