Pithapuram: రాజులమ్మకు సహాయం అందించిన జనసేన వీరమహిళ గౌరీ నాగలక్ష్మి..!

పిఠాపురం, జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో రాజులమ్మకు ఆరోగ్య పరిస్థితి బాగోక బోధకాలుతో ఇబ్బంది పడుతుందని తెలుసుకుని తోచిన సాయం చేయాలని పిఠాపురం రూరల్ మండలానికి సంబంధించిన కోలంక జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వీర మహిళ కేతినిడి గౌరీ నాగలక్ష్మి శనివారం సాయంత్రం రాజులమ్మకు 50 కేజీల బియ్యం మెడిసిన్ కొరకు 1500 ధన సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ ఎంపిటిసి దూలపల్లి రత్నం, దేశిరెడ్డి సతీష్, డి.సన్నీ, కేతినిడి శ్రావణ్, గట్టి సాయి, కంతకురెడ్డి లక్ష్మి, గట్టి అమ్మాజీ, గట్టి సత్యనారాయణ, కేశరపు యమునా, చంద్రావతి, మేరీ, కేతినిడి అమ్మాజీ, శ్రీపత్తి రాణి, దూలపల్లి అప్పారావు, నురుకుర్తి ప్రసాద్, పలివెల మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.