రణస్థలంలో పలుకుటుంబాలకు జనసేన నాయకుల పరామర్శ

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కొవ్వాడ గ్రామంలో సూరాడ రాముడు కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ మూడు రోజులు క్రితం చనిపోవడం జరిగింది. ఎచ్చెర్ల జనసేన నాయకులు సూరాడ రాముడు కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అనంతరం కోటపాలెం గ్రామంలో ఐదు రోజుల క్రితం నీటిలో మునిగి వైరు చుట్టులొని మరణించిన చౌదిరి అప్పన్న కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. తదనంతరం కొల్లిభీమవరం గ్రామంలో గుండెపోటుతో మరణించిన కొల్లి సూర్యనారాయణ కుటుంబాని జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు వడ్డాది శ్రీనువాసరావు, దాసరి బలరాం, గోర్లె సూర్య, పోట్నూరు లక్ష్మునాయుడు, అప్పన్న, ముళ్ళు శ్రీను, కె.బాలు, సూరాడ లక్ష్ముణ తదితరులు పాల్గొన్నారు.