మంత్రాలయం జనసేన ఆత్మీయ సమావేశం

మంత్రాలయం నియోజకవర్గం, కోసిగి మండల కేంద్రంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఫంక్షన్ హాల్ నందు మంత్రాలయం జనసేన యువ నాయకులు పొంత నరసింహులు ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పెద్దకడబూర్, కౌతాళం, మంత్రాలయం, కోసిగి నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయాలని ఈ సమావేశంలో పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని సూచించడం జరిగింది. ఈ సమావేశానికి కోసిగి మండల యువ నాయకుడు పూజారి రమేష్, కౌతాళం మండల యువ నాయకుడు హాజీ మరియు చింతలగేని నాగేష్, నాగరాజ్ రమేష్ రవికుమార్, రజాబ్ వాలి పాల్గొనడం జరిగింది.