తుఫాన్ బాధితులను పరామర్శించిన జనసేన నాయకులు

పాడేరు: జి కె వీధి, మండలం వంచుల పంచాయితీలో ఎళ్లవరం కట్టువీది గ్రామంలో మిచాంగ్ తుఫాన్ కారణంగా బారీ వర్షాలకు పాంగి వెంకటరావు, పాంగీ బందు ఇల్లు పూర్తిగా ద్వంసం అయ్యింది. అక్కడ గ్రామస్థులు జనసేన పార్టీ నాయకులకు సమస్యలు తెలియపరిచారు. వైసీపీ ప్రభుత్వము అధికారంలో రాకముందు రోడ్డు వేస్తామన్నారు, అలాగే ప్రభుత్వము నుండి ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడ మంజూరు కాలేదు. జలజీవన్ మిషన్ ద్వారా టాంక్ మాత్రమే నిర్మించారు. మిగతా తప్స్ గానీ ఎటువంటి సదుపాయాలు పూర్తి కాలేదు అని గ్రామస్థులు చెప్తున్నారు. పరామర్శించడానికి జనసేన నాయకులు గుండ్ల రఘు, వంశీ, అరడ కోటేశ్వరావు, వనపల ఈశ్వర్, మదు కుమార్ తదితరుపాల్గొన్నారు.