కోర్టు వాయిదాకు హాజరైన జనసేన నాయకులు

కాకినాడ రూరల్: 2020 జనవరి 12వ తేదీన కాకినాడలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతున్న జనసేన శ్రేణులపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించిన సంగతి అందరికీ విదితమే. ఆ కేసుల నిమిత్తం కాకినాడ జిల్లా కోర్టు వాయిదాకు గురువారం జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, సీనియర్ నాయకులు పంచకర్ల సందీప్, గంటస్వరూప, ప్రియా సౌజన్య, తూము బన్ను, కర్ని శ్రీనివాస్, నున్న గణేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.