మానవత్వం చాటుకున్న జనసేన నేతలు

సిద్ధవటం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి మనసున్న మంచి మనుషులుగా రాజంపేట జనసేన పార్టీకి చెందిన రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జ్ మల్లి శెట్టి వెంకటరమణ, ఉప్పరపల్లె గ్రామానికి చెందిన జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్యలు మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్ధవటం మండలం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పాత్రికేయునిగా పనిచేస్తున్న పెండ్లిమర్రి మల్లేశ్వరయ్య షుగర్ వ్యాధితో బాధపడుతూ.. ఓప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతూ.. షుగర్ అధికమవడం వలన తన ఎడమ కాలు ఇన్ఫెక్షన్ అవడంతో డాక్టర్లు కాలు తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీని ఆశ్రయించగా వారు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి.. పాత్రికేయుని పరామర్శించి.. ఆరోగ్య సమస్యలు తెలుసుకుని 10.వేల రూపాయలను ఆర్థిక సహాయం అందజేసి.. మనో ధైర్యాన్ని నింపారు. అంతేకాకుండా పాత్రికేయునికి ఇంకా ఎవరైనా సహాయం చేసి మల్లేశ్వరయ్యను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, పసుపులేటి కళ్యాణ్, కొట్టే రాజేష్ పాల్గొన్నారు.