సిద్ధి వినాయకుని దర్శించుకున్న గిడ్డి సత్యనారాయణ

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గ జనసేన-టిడిపి-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన-బిజెపి పార్టీ అదినాయకులకు అభినందనలు తెలిపారు. పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన-టిడిపి-బిజెపి జెండా ఎగురుతుంది అని, అలాగే నా మీద నమ్మకం ఉంచి నన్ను అభ్యర్థిగా ప్రకటించడమే కాకుండా నాసొంత నియోజకవర్గనికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నా ఊపిరి ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లోనే నడుస్తానని, గన్నవరం నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతం కావడంతో వరదలు వచ్చినప్పుడు రెండు మూడు నెలల పాటు లంక గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నందున నేను గెలిచి ఎమ్మెల్యే అయిన వెంటనే ముందుగా వరదల తాకిడి లంక గ్రామాలకు తగలకుండా తగు జాగ్రత్తలను అందుకు కావలసిన రివిట్మెంట్ పనులు గురించి పాటు పడతానని, అన్ని నియోజకవర్గాల కంటే పి.గన్నవరం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బాగా వెనకబడి ఉందని. కొన్ని గ్రామాల్లో అయితే మంచినీరు దొరకలేనిపరిస్థితిలు కూడా ఉన్నాయని నియోజకవర్గ ప్రజలు ప్రయాణం చేయాలంటేనే రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల భయపడుతున్నారని కొన్ని గ్రామాల నుంచి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుకున్నారని అలాగే చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో మరెన్నో సమస్యలు ఉన్నాయని పి.గన్నవరం నియోజకవర్గం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని గిడ్డి సత్యనారాయణ అన్నారు. అనంతరం భారీ ఎత్తున జనసేన-టిడిపి-బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి-బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.