పాత పూసల మర్రి గ్రామంలో ముఖ్య నాయకులను కలిసిన జనసేన నాయకులు

భీమవరం మండలం, పాత పూసల మర్రి గ్రామంలో భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ బలోపేతం కొరకు గ్రామంలోని పెద్దలను ముఖ్య ముఖ్య నాయకులను కలవడానికి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు నరసాపురం ఇన్చార్జ్ బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ రాష్ట్ర మత్స్య శాఖ విభాగం కార్యదర్శి మల్లాది శ్రీమన్నారాయణ, పొడుగు ప్రభాస్ రాజు, మొగల్తూరు మండల అధ్యక్షులు కొల్లాటి గోపికృష్ణ, కుత్తు మెనూ మండల అధ్యక్షులు తిరుమణి రామాంజనేయులు విచ్చేశారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన్నటువంటి పొన్నమండ జగన్నాధం కుటుంబాన్ని నాయకులు పరామర్శించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాపోలు ఆంజనేయులు, నాగిడి ఏడుకొండలు, వాటాలు వెంకటేష్, రేవు తాతయ్యా, గోవిందు, మురళికార్తిక్ పాల్గొన్నారు.