వైసిపి పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది: అనంత జనసేనాని టి.సి వరుణ్

గుంతకల్, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ ఆధ్వర్యంలో నిర్వహించిన గుంతకల్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు టి.సి వరుణ్ కి వీరమహిళలు విజయ , సంధ్య లు హారతినిచ్చి, నిస్వార్థ జనసైనికులు బాణాసంచా పేలుస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధ్యక్షులు టి.సి.వరుణ్ మాట్లాడుతూ గుంతకల్ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్రియాశీలక సభ్యత్వం, మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లకు గురించి కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ 2024 ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేసుకుని అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని, అలాగే ఈ అసమర్థ వైసిపి ప్రభుత్వపు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రజా పోరాటాలు చేస్తూ గుంతకల్ నియోజకవర్గంలోని జనసేన నాయకులు ప్రజలకు చేరువవ్వాలని పిలుపునిచ్చారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క జనసైనికుడు, జనసేన నాయకులు భద్రతా భవితవ్యం గురించి ఆలోచన చేసి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేపట్టారు, కావున జనసేన శ్రేణులు అందరూ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుని సమాజానికి, కుటుంబానికి భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, కార్యదర్శి కిరణ్, సంయుక్త కార్యదర్శి జీవన్ కుమార్, గుత్తి మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ, గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు పాటిల్ సురేష్ మరియు పెద్ద ఎత్తున నియోజకవర్గం జనసేన నాయకులు, నిస్వార్థ జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.