ఆల్ పార్టీ మీటింగులో పాల్గొన్న జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం శుక్రవారం ఎమ్మార్వో కార్యాలయంలో అల్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మార్వో మాట్లాడుతూ ఈ 2024 ఎలక్షన్స్ సంబంధించి ఓటర్లకు ఇబ్బంది కలగకుండా బూత్ అడ్రస్లలో ఉన్న తప్పులను సరిచేసినట్టు మరియు సరిచేసిన వివరాలను అందరికి స్పష్టంగా వివరించారు. అనంతరం పార్వతీపురం మండలానికి కొత్తగా నిముతులైన ఎమ్మార్వో కె.రాముని జనసేనపార్టీ నాయకులు చందక అనీల్, రాజాన రాంబాబు, సిరిపురపు గౌరీ, మానేపల్లి ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో సత్కరించడం జరిగింది.