జనసైనికుడు రామకృష్ణ అంతిమ యాత్రలో పాల్గొన్న జనసేన నాయకులు

దెందులూరు నియోజకవర్గం: గాలాయగూడెం గ్రామానికి చెందిన దెందులూరు నియోజకవర్గ మాజీ ఐటీ కో-ఆర్డినేటర్, గాలాయగూడెం గ్రామ వార్డు మెంబర్, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు, జనసేన పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేసే ఏనుగు రామకృష్ణ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఈ రోజు ఆయన స్వగ్రామంలో జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా. ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు మండల జనసేన నాయకులు పెద్దిశెట్టి నాని, పూజారి సీతారత్నం నాయుడు, ఏలూరు నగర జనసేన నాయకులు తాతపూడి చందు మరియు స్థానిక జనసేన నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.