శ్రీ గంగాభవాని అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా, దర్శి, కురిచేడు మండలం, గంగదొనకొండ గ్రామంలో వెలసి యున్న శ్రీ గంగాభవాని అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా జనసేన ఎలక్ట్రిక్ ప్రభకి ముఖ్య అతిధులుగా దర్శి నియోజకవర్గ నాయకులు వరికూటి నాగరాజు, జనసేన పార్టీ యువ నాయకులు దాసరి కిరణ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణలు పాల్గొనడం జరిగింది. ఈ కారయ్క్రమంలో దర్శి నియోజకవర్గ నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించి రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.