వాల్మీకుల మేలుకొలుపు యాత్రకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు

గుంతకల్, వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బోయ హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు క్రాంతి నాయుడు చేపట్టిన బైకు యాత్ర గుంతకల్లు పట్టణంకు చేరుకున్న సందర్భంగా జనసేన నాయకులు మద్దతు తెలపడం జరిగింది. వాల్మీకి బోయల హక్కుల సాధనకు మంత్రాలయం నుండి అమరావతికి చేపట్టిన వాల్మీకుల మేలుకొలుపు యాత్ర బుధవారం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంకు చేరుకుంది, ఈ సందర్భంగా పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ భారీగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, రాపా ధనుంజయ్, సంయుక్త కార్యదర్శి అవుకు విజయ్, అరికేరి జీవన్ కుమార్ గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, విడపనకల్లు మండల అధ్యక్షుడు గోపాల్, గుంతకల్ నియోజకవర్గం సీనియర్ నాయకులు సుబ్బయ్య, బండి శేఖర్, బోయ లోకేష్, బోయ సురేష్, విజయ్ కుమార్, వాల్మీకి వీరేశ్, కసాపురం నంద, పసుపులేటి ఓబులేష్, మహేష్, మోహన్, దాదు, ఓబులేష్ కాంత తదితరులు పాల్గొనడం జరిగింది.