సతివాడ గ్రామంలో పర్యటించి గ్రామ సమస్యలను తెలుసుకున్న జనసేన నాయకులు

టెక్కలి, పార్టీ బలోపేతంలో భాగంగా నేడు టెక్కలి మండలం సతివాడ గ్రామంలో టెక్కలి జనసేన ఇంచార్జ్ కణితి కిరణ్ పర్యటించి గ్రామస్తులను, గ్రామ పెద్దలను, యువతను కలసి గ్రామ సమస్యలను తెలుసుకోవడం జరిగినది. ఈ పర్యటనలో జనసేన నాయకులు లాయర్ రాంప్రసాద్, కొత్తూరు హరి, క్రాంతి, స్వాదీన్, దాసరి బాపూజీ, శ్యామ్, ప్రసాద్, సూర్య ప్రకాష్ లు పాల్గొన్నారు.