కన్నా లక్ష్మీనారాయణ దీక్షకి మద్దతు తెలిపిన జనసేన

సత్తెనపల్లి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా, అన్యాయంగా అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం రెండు రోడ్ల దగ్గర “రిలే నిరాహార దీక్షలో” తెలుగుదేశం పార్టీ సత్తనపల్లి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణకి మద్దతు తెలిపిన జనసేన పార్టీ మండల జనసైనికులు వీర మహిళలు నాయకులు గ్రామ అధ్యక్షులు గ్రామ కమిటీ వారు మండల కమిటీ వారు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్.

వావిలాల గోపాల కృష్ణయ్య 118వ జయంతిలో పాల్గొన్న బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, దేశం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు. అలాంటి గొప్ప వ్యక్తి, స్వాతంత్య్ర సమర జ్వాల మన వావిలాల గోపాలకృష్ణయ్య. భరతమాత ముద్దుబిడ్డగా దేశ సేవలో తరించిన ధన్యజీవి. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు. బ్రిటీష్‌ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల గోపాల కృష్ణయ్య. ఆదివారం ఆ మహనీయుడి 118వ జయంతిని పురస్కరించుకొని వావిలాల ఘాటులో సత్తెనపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. కావున ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కౌన్సిలర్, ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీ వారు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీ వారు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొని వావిలాల గోపాలకృష్ణయ్యకి ఘన నివాళులు అర్పించారు .